హన్మకొండ బీజేపీ ఆందోళనలో అపశృతి

Update: 2019-06-24 07:08 GMT

హన్మకొండలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు దిష్టిబొమ్మ దగ్దం చేస్తుండగా అపశృతి చోటుచేసుకుంది. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా చేతులకు మంటలు అంటుకున్నాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా బింగి శ్రీనివాస్ శరీరానికి మంటలు అంటుకోగా ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని హన్మకొండ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేస్తుండగా ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇతర కార్యకర్తలు, పోలీసులు మంటలను ఆర్పేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో పలువురు బీజేపీ కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి.

Full View

Tags:    

Similar News