టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో భేటి అయ్యారు. నిన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ఆయన ... ఈ రోజు అమిత్ షాతో భేటి కావడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డీఎస్ ... నిన్న జరిగిన పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరిని ఆశ్చర్య పరిచారు. సమావేశంలో పాల్గొని 24 గంటలు కూడా గడవక ముందే అమిత్షా తో భేటి కావడం తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన డీఎస్ తనయుడు .... ధర్మపురి అర్వింద్ ... సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి విజయం సాధించారు.