రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 8వ వార్డులో నకిలీ ఓటర్ కార్డులతో దొంగ ఓట్లు వేసేందుకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. వారిని గుర్తించిన కాంగ్రెస్ నేతలు ఇద్దరిని పట్టుకుని చితకబాదారు. టీఆర్ఎస్ నాయకుడు నాగార్జున ఓటుకు మూడు వేలు ఇస్తానని మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 70 దొంగ ఓట్లు వేసేందుకు యువకులు పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అనుమానం వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆరా తీయగా అసలు విషయం బయటపడటంతో యువకులను చితకబాదారు.