తుది శ్వాస విడిచే వరకూ కాంగ్రెస్లోనే ఉంటానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతానని ఎక్కడా చెప్పలేదని, పార్టీని ప్రక్షాళన చేయాలని మాత్రమే కోరారని గుర్తు చేశారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నానని పార్టీ మారే ప్రసక్తే లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చి చెప్పారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు.