Congress: ఢిల్లీ బాట పట్టిన టీ కాంగ్రెస్ నేతలు

Congress: కొత్త పీసీసీ ప్రకటన ఉన్న నేపథ్యంలో ఢిల్లీకి నేతలు

Update: 2021-06-12 08:37 GMT

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Congress: ఒకటి రెండు రోజుల్లో కొత్త పీసీసీ పేరు ఫైనల్ అయ్యే అవకాశం ఉండడంతో.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు. అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండేందుకు రెడీ అయ్యారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూడు రోజులుగా హస్తినాలోనే ఉన్నారు. ఆ తర్వాత నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇవాళ సీఎల్పీ నేత బట్టివిక్రమార్క కూడా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో అధిష్టానం ఎవరిని నియమిస్తుందోనని సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News