రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తమ వాదనలను ఎలక్షన్ కమిషన్ వినిపించుకోవడం లేదని నిరసన తెలిపింది. ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డితో మర్రి శశిధర్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఇష్టప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తోందని శశిధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్తో ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.