Revanth Reddy: సచివాలయంలో ధరణిపై ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
Revanth Reddy: సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణిలో ఉన్న లోపాలు.. సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.
Revanth Reddy: సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ధరణిలో ఉన్న లోపాలు.. సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. కాగా... గతంలో రేవంత్ రెడ్డి ధరణి పేరుని భూమాతగా మారుస్తామని... చెప్పడంతో.. తాజాగా ధరణిపై చేసిన రివ్యూకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. అయితే.. తాజాగా.. ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. సమస్యల పరిష్కారానికి కమిటీ వేయనుంది. దీంతోపాటు.. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నెలకు ఓసారి మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.