ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్లో మంత్రి పువ్వాడ అజయ్తో పాటు ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై శుక్రవారంలోపు నిర్ణయం తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏయే అంశాలపై వాదనలు కొనసాగించాలనే విషయంపై సీఎం అధికారులతో కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండీ నియామకంపైనా కసరత్తు చేస్తున్నారు.