స్వతంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. ఇంటింటికీ..

Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

Update: 2022-08-02 11:37 GMT

స్వాతంత్ర్య భార‌త వ‌జ్రోత్స‌వ వేడుక‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌.. ఇంటింటికీ.. 

Azadi Ka Amrit Mahotsav: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కమిటీ చైర్మన్‌ కేకేతో పాటు మరో 24 మంది సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 8న ప్రారంభోత్సవ సభకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దేశ సమైక్యత, దేశభక్తిని పెంపొందించేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు కోటి మువ్వన్నెల జెండాలను సిద్ధం చేశారు అధికారులు. అలాగే అన్ని థియేటర్లలో విద్యార్థులకు ఉచితంగా దేశభక్తి చాటే సినిమాలను ప్రదర్శించనున్నారు.

Full View


Tags:    

Similar News