రాజ్భవన్లో నరసింహన్ను కలిసిన కేసీఆర్
సీఎం కేసీఆర్.. రాజ్భవన్లో నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణకి నూతన గవర్నర్ను నియమించడంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్.. రాజ్భవన్లో నరసింహన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణకి నూతన గవర్నర్ను నియమించడంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహన్.. ఇన్నాళ్లూ రాష్ట్రానికి అనేక సహాయసహాకారాలు అందించారని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత నుండి నేటి వరకూ విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారానికి నరసింహన్ కృషి చేశారని కేసీఆర్ తెలిపారు.