సీఎం కేసీఆర్ శుభవార్త : హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల

త్వరలోనే నాగార్జునసాగర్ కి ఉపఎన్నిక జరగనున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు శుభవార్తను అందజేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

Update: 2020-12-06 11:23 GMT

త్వరలోనే నాగార్జునసాగర్ కి ఉపఎన్నిక జరగనున్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు శుభవార్తను అందజేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. డిగ్రీ కాలేజీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలోనే కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అటు నల్గొండ జిల్లా పరిధిలోని ఆయా ఎత్తిపోతల పధకాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. 

Tags:    

Similar News