గోదారమ్మ చెంతకు బయల్దేరిన కేసీఆర్‌

Update: 2019-08-06 06:02 GMT

 ‎ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శనకు బయల్దేరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ఆయన పయనమయ్యారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని పరిశీలించనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ, గోలివాడ్ పంప్ హౌస్‌‌‌ను ఏరియల్‌ రివ్యూచేసి, అనంతరం ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోనున్నారు. ముఖ‌్యమంత్రి కేసీఆర్‌ వెంట మంత్రి ఈటల రాజేందర్‌, ఉన్నతాధికారులు సొమేశ్‌కుమార్‌, నర్సింగరావు, స్మితా సబర్వాల్‌, రామకృష్ణారావులు బయల్దేరి వెళ్లారు.

Tags:    

Similar News