ఖమ్మంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యా యత్నంతో ఉద్రిక్తపరిస్తితులు ఏర్పడ్డాయి. పెద్దసంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన కార్మికులు ఖమ్మం బస్టాండుతో పాటు, మయూరి సెంటర్ లో ఆందోళనకు దిగారు. ఖమ్మం పట్టణంలో టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ దౌర్జన్యంగా వ్యవహరించారు. ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పిడిగుద్దులు కురిపించారు. కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులను సైతం అంతు చూస్తామంటూ సీఐ బెదిరించారు.