Telangana: నేడు ప్రగతిభవన్‌లో డిస్కంలపై సీఎం సమీక్ష

Telangana:విద్యుత్ చట్టాలపై అధికారులతో చర్చించనున్న కేసీఆర్ * ఈ నెల 28న యాదాద్రికి సీఎం కేసీఆర్‌

Update: 2021-02-24 05:00 GMT

CM KCR (ఫైల్ ఇమేజ్)

Telangana: ఇవాళ ప్రగతి భవన్‌లో డిస్కంలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ చట్టంపై కేంద్రమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సారాంశాన్ని సీఎంకు వివరించనున్నారు సీఎండీలు. మరోవైపు ఈ నెల 28న యాదాద్రికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించనున్నారు. ఆలయ పనులను పరిశీలించి ఎప్పటివరకు పూర్తవుతాయనే విషయంపై ఆరా తీయనున్నారు. అనంతరం చినజీయర్‌ స్వామిని కలసి ఆలయ పునఃప్రారంభం తేదీని ఖరారు చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News