పసుపు రైతులకు శుభవార్త.. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
సంక్రాంతి పండగ రోజు పసుపు రైతులకు తీపి కబురు అందించింది కేంద్రం. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణ సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీనిపై కేంద్రం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. పసుపు బోర్డు ఏర్పాటుపై ఢిల్లీ అధికారులతో ఎప్పటికప్పుడు ఎంపీ అరవింద్ సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రైతులకు ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చిన విషయం విధితమే.