ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

Update: 2021-01-05 11:05 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఏసీబీ కోర్టు ఎదుట ఎంపీ రేవంత్‌ రెడ్డి, ఉదయ్‌ సింహ హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ క్రమంలో కేసు ఈసీ పరిధిలోకి వస్తుందని రేవంత్‌రెడ్డి తరుపు లాయర్‌ వాదన వినిపించగా కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు ఏసీబీ అధికారులు. వాదనలు, ప్రతివాదనలు విన్న ఏసీబీ కోర్టు ఈనెల 11కు తీర్పును వాయిదా వేసింది.

Tags:    

Similar News