కరీంనగర్లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని వివాదం రేగింది. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని మొదట పోలీసులు కేసు నమోదు చేయలేమని తెలిపారు. దీనిపై బీజేపీ నాయకుడు ఒకరు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాలతో కరీంనగర్ త్రిటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.