ఆ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్లు మాత్రమే ఉన్నారు : ఎమ్మెల్యే భూపాలరెడ్డి

Update: 2019-07-20 16:07 GMT

ఈనెల 18న ఎల్బీ నగర్ ఫ్లై ఓవర్‌ పై ఎమ్మెల్యే వాహనం ఢీకొన్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో ఇద్దరు అడ్వకేట్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ వాహనంలో తాను లేనని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అంటున్నారు. ఆ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆ వాహనం తనపేరు మీద రిజిస్టర్ ‌అయి కూడా లేదని చెప్పారు. వారే ద్విచక్ర వాహనంతో తమ వాహనాన్ని ఢీకొట్టారని అంటున్నారు. అయితే బాధితులు మాత్రం ఎమ్మెల్యే వాహనం ఢీకొనడంతో తాము గాయపడ్డామని చెబుతున్నారు.   

Tags:    

Similar News