యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి వద్ద కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సర్నెగూడెం సర్పంచ్ భర్త మధు, కుమారుడు మణికంఠ, కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. చెరువులో పడ్డ కారును స్థానికులు బయటకు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.