మంత్రివర్గ విస్తరణ తర్వాత టీఆర్ఎస్లో రోజురోజుకీ అసమ్మతి పెరుగుతోంది. ఒకరి తర్వాత మరొకరు తమ అసంతృప్తిని బయటపెడున్నారు. ఇప్పటికే పలువురు నేతలు... తమ ఆవేదనను ఆక్రోశాన్ని వెళ్లగక్కగా... బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ ఏకంగా బీజేపీ ఎంపీ అర్వింద్తో సమావేశమై కలకలం రేపారు. కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఆశించిన షకీల్..... అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్తో సమావేశం కావడంతో... పార్టీ మారొచ్చనే మాట వినిపిస్తోంది.