హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు : కృష్ణసాగర్ రావు
ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై సమీక్షించడాన్ని బీజేపీ స్వాగతించింది. హైకోర్టు మెట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై సమీక్షించడాన్ని బీజేపీ స్వాగతించింది. హైకోర్టు మెట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు అన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో గవర్నర్ జోక్యం చేసుకున్నారంటే ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లేనని చెప్పారు. రాష్ట్ర వ్యవస్థ మొత్తం స్తంభించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కృష్ణసాగర్ డిమాండ్ చేశారు.