బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి కన్నుమూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజరాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్వాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్గా పిలుచుకొనేవారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. పాతబస్తీ అలియాబాద్ జంగమ్మెట్ ప్రాంతానికి చెందిన ఆయన ఓల్డ్సిటీలో బీజేపీ బలోపేతానికి విశేషమైన కృషి చేశారు.