ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కుమ్మకయ్యారు: ఎంపీ అరవింద్

Update: 2019-07-25 11:03 GMT

బీజేపీపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించారు. మతం పేరుతో అన్నదమ్ములు పబ్బంగడుపుకుంటున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కుమ్మకై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైరయ్యారు. 15 ఏళ్ల సమయం ఇచ్చినా అక్బరుద్దీన్ ఏమీ చేయలేరని గుర్తు చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.

Full View

Tags:    

Similar News