ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కరోనా

Update: 2020-09-24 12:33 GMT

కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక తెలంగాణలో కూడా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బీజేపీ నాయకుడు, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ప్రభుత్వ నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. గత వారం రోజులుగా తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా పరీక్ష చేయించుకొని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆయన కోరారు.

Tags:    

Similar News