నిజామాబాద్ ఫలితమే హుజూర్‌నగర్‌లో రిపీట్ అవుతుంది

Update: 2019-10-15 12:13 GMT

నిజామాబాద్ ఫలితమే హుజూర్‌నగర్‌లో రిపీట్ అవుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకుంటున్నారని అన్నారు. నిశబ్ద విప్లవం ప్రజల్లో కనిపిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ కుటుంబం కోసం పని చేసే వ్యక్తని కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభమన్నారు. బీజేపీ అభ్యర్థి రామారావు గెలిస్తే నియోజకవర్గానికి మేలు జరుగుతుందని తెలిపారు. 

Tags:    

Similar News