ఖమ్మంజిల్లా లక్ష్మీపురంలో భట్టి విక్రమార్క పాదయాత్ర

Bhatti Vikramarka: రైతు కష్టాలను దూరంచేసేదాకా పోరాటం ఆగదు

Update: 2022-04-12 09:20 GMT

ఖమ్మంజిల్లా లక్ష్మీపురంలో భట్టి విక్రమార్క పాదయాత్ర

Bhatti Vikramarka: రైతు కష్టాలను దూరంచేసేందుకు పోరాటం చేస్తామని మధిర ఎమ్మెల్యే, సీఎల్పీ నాయకుడు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మంజిల్లాలో తలపెట్టిన పీపుల్స్ మార్చ్ లో ఆయన లక్ష్మీపురంలో పాదయాత్ర చేశారు. లక్ష్మీపురం గ్రామంలో ఒంటరిగా వృద్ధ వయసులో జీవిస్తున్న కాశి బోయిన భద్రమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి తన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె నివాసం ఉంటున్న చిన్ని గుడిసెలు చూసి చలించి పోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష్మీపురంలో తొలి ఇల్లు కట్టిస్తామని మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఆతర్వాత పాదయాత్రలో రైతు సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.

Tags:    

Similar News