అసెంబ్లీ స్పీకర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ

Update: 2019-09-14 06:46 GMT

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం సీట్లను ఎంఐఎంకు కేటాయించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. సభలో సీట్ల మార్పుపై స్పీకర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. సభలో అసమ్మతి స్వరానికి తగిన స్థానం ఇవ్వడం లేదన్నారు. స్నేహపూర్వక పార్టీ అని ప్రకటించిన ఎంఐఎం ను సభలో ప్రతిపక్ష పార్టీగా ఏ విధంగా పరిగణిస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం కాంగ్రెస్ సభ్యులకు ప్రతిపక్ష బ్లాక్ కేటాయించాలని అభ్యర్ధించారు. 

Tags:    

Similar News