Bandi Sanjay: మహిళ అని చూడకుండా గవర్నర్ను అవమానిస్తున్నారు
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ అని చూడకుండా గవర్నర్ ను ప్రతి సారి అవమానపరుస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. కానీ దశాబ్ధి ఉత్సవాలకు 150 కోట్లు ఇస్తామని ప్రకటన చేశారు.
రాష్ట్ర వైఫల్యాలు చర్చకి రాకండా ఉండేందుకే ఉత్సవాల పేరుతో ప్రభుత్వం హడావిడి చేసస్తోందని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలోను లిక్కర్ దందా జరిగిందని ఇందులోనూ కేసిఆర్ కుటుంబం ఉందేమో అన్న అనుమానాలు వస్తున్నాయని అన్నారు. తెలంగాణలోను లిక్కర్ దందాపై విచారణ జరపాలని సంజయ్ డిమాండ్ చేశారు.