తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళ్లేశ్వర ప్రాజెక్టు మరికాసేపట్లో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేడిగడ్డకు బయలుదేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన మేడిగడ్డకు చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్కుమార్ యాదవ్ ఉన్నారు. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు. 10:50 గంటలకు మేడిగడ్డ బరాజ్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరో నంబరు గేటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్లో ఆరో నంబరు మోటార్ను కేసీఆర్ స్విచ్ఛాన్ చేసి ప్రారంభిస్తారు.