తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సీఎం జగన్‌

Update: 2020-01-28 05:17 GMT

సీఎం జగన్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడానికి సీబీఐ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టులో సవాల్‌ చేశారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనా విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత ఉందన్న జగన్‌ ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయన్న కారణంగా హాజరు మినహాయింపు నిరాకరించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది.

Tags:    

Similar News