నేడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీఎం జగన్‌

Update: 2020-02-07 04:53 GMT
నేడు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. వ్యక్తిగత హాజరు మినహాయింపుకోసం హైకోర్టులో పిటిషన్ ఉండటంతో జగన్ తరపు లాయర్లు కోర్టులో ఆప్సెంట్ పిటిషన్ దాఖలు చేస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదే చేస్తారని అనుకున్నారు. కానీ హైకోర్టులో సీబీఐ కేసుల్లో మాత్రమే హాజరు మినహాయింపు పిటిషన్ పై విచారణ జరుగుతోంది.

రెండు వారాల క్రితం ఈడీ కేసుల్లోనూ కచ్ఛితంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. దీనిపై గత వారం హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ మళ్లీ వెనక్కు తీసుకున్నారు. ఆ తర్వాత దాఖలు చేయలేదు. సీబీఐ కోర్టుకు ఇవాళ హాజరవుతున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఏమిటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News