సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసు.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎంపీ రియాక్షన్...

Anjan Kumar Yadav: బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Update: 2022-04-03 09:24 GMT

సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసు.. తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై మాజీ ఎంపీ రియాక్షన్...

Anjan Kumar Yadav: బంజారాహిల్స్​లోని ర్యాడిసన్ బ్లూ హోటల్​పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కాం‍గ్రెస్‌ మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కొడుకు అరవింద్‌ కూడా ఉన్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో అంజన్‌ కుమార్‌ యాదవ్‌ స్పందిస్తూ.. పుడింగ్‌ పబ్‌లో దొరికిన అందరి పేర్లను బయట పెట్టాలని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఉన్న అన్ని పబ్‌లను వెంటనే ప్రభుత్వం మూసివేయాలన్నారు. పబ్బుల్లోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల హస్తం లేకుండా డ్రగ్స్ సప్లై అవుతుందా అన్నారు. అనసవరంగా తన కుటుంబాన్ని బదనాం చేయోద్దని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు.

Tags:    

Similar News