Anchor Shyamala: యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్‌ కేసు

Anchor Shyamala: యాంకర్‌ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది.

Update: 2021-04-27 09:32 GMT

Anchor Shyamala: యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై చీటింగ్‌ కేసు

Anchor Shyamala: యాంకర్‌ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది. కోటి రూపాయలు తీసుకుని తనను మోసం చేశాడని ఓ మహిళా ఫిర్యాదు చేసింది. 2017 నుండి విడతల వారీగా డబ్బులు తీసుకున్నట్లు కంపైంట్‌ చేసింది. ఇక డబ్బులు అడగడంతో శ్యామల భర్త నర్సింహారెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు బాధిత మహిళ చెబుతోంది. ఇక సెటిల్‌ మెంట్‌ చేసుకోవాలంటూ నర్సింహారెడ్డి తరుపు ఓ మహిళా రాయబారం నడిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింహారెడ్డితోపాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News