కేవలం ఐదుగురు నేతలతోనే ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్‌

Update: 2021-01-06 11:29 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలతో టీకాంగ్‌ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. కేవలం ఐదుగురు ముఖ్యనేతలతో మాత్రమే ఠాగూర్ సమావేశమయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోన్న మాణికం ఠాకూర్‌ టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చిస్తున్నారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే పీసీసీ చీఫ్‌ను ప్రకటించాలన్న జానారెడ్డి విజ్ఞప్తిపైనా అభిప్రాయాలు తీసుకోనున్నారు.

Tags:    

Similar News