బీజేపీ నేతపై సంచలన ఆరోపణలు చేసిన మహిళ
బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావుపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. రఘునందన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని ఓ మహిళా సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి ఫిర్యాదు చేశారు. రఘునందన్ తనపై అతని ఆఫీసులో కాఫీలో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మెదక్ జిల్లాలోని ఆర్సీపురంకి మహిళ 2003 స్థానిక పోలీసు స్టేషన్లో భర్తతో విభేదాలు కారణంగా.. న్యాయవాది రఘునందన్, ఆమె భర్తపై ఫిర్యాదు చేశారు. రఘునందన్ తోపాటు ఆమె భర్తపై మెయింటెనెన్స్ కేసు నమోదు చేశారు.
గత కొంత కాలంగా అశ్లీల చిత్రాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని ఆరోపించారు. హెచ్ఆర్సీని ఆశ్రయించానని రఘునందన్పై కేసు పైల్ చేయాలని ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు. తనకు న్యాయం చేయాలని సీపీ సజ్జనార్ను కలిసి కోరినట్లు తెలిపారు.
ఓ మహిళ తనపై చేసిన ఆరోపణలపై బీజేపీనేత రఘునందన్ రావు స్పందించారు. రాజకీయకుట్రలో భాగంగానే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. తాను ఎప్పుడూ తప్పుడు పని చేయలేదని స్పష్టం చేశారు. రేపు తానే స్వయంగా HRC కి వెళ్లి ఫిర్యాదు పత్రాలు తీసుకుంటానని రఘునందన్ రావు తెలిపారు.