ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి తండ్రిని హతమార్చి.. సహజమరణంగా సీన్ క్రియేట్ చేశాడు. అంతా ఈ విషయాన్ని నమ్మి, కృష్ణమూర్తికి అంత్యక్రియలను కూడా నిర్వహించేశారు. అయితే, మృతదేహంపై ఉన్న గాయాలను గమనించిన.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. శవాన్ని బయటకు తీసిన పోలీసులు.. రీపోస్ట్మార్టమ్ చేయించారు.
కృష్ణమూర్తి కుమార్తె, చరణ్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. అయితే, వీరి ప్రేమ వివాహనికి.. ప్రియురాలి తండ్రి ఒప్పుకోవడం లేదని.. అతనిపై పగతో రగిలిపోయాడు చరణ్. అదును చూసి, ప్రియురాలి తండ్రిని ఊరి వేసి చంపిన చరణ్.. సహజ మరణంగా క్రియేట్ చేశారు. బంధువులతో పాటు గ్రామస్థులను కూడా సహజ మరణంగానే నమ్మించాడు. అక్కడితే ఆగకుండా, అంత్యక్రియలను కూడా ఆగమేఘాల మీద జరిపించేశాడు.
ఇక్కడి వరకు అంతా చరణ్.. అనుకున్నట్టే జరిగింది. అయితే, మృతుని భార్యకు.. మృతదేహంపై గాయలను చూడగానే కొంత అనుమానం వచ్చింది. దీంతో తన భర్తది సహజ మరణం కాదని భావించింది. పోలీసులను ఆశ్రయించింది. రంగంలో దిగిన పోలీసులు కృష్ణమూర్తి శవాన్ని బయటకు తీయించారు. రీ పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. సహజ మరణం కాదని గుర్తించారు.