Shamshabad: హైదరాబాద్లో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Shamshabad: రూ.2.5 లక్షల విలువైన 2 కేజీల మాంసం స్వాధీనం
Shamshabad: హైదరాబాద్లో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Shamshabad: శంషాబాద్ పరిధిలో దుప్పి మాంసం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వన్యప్రాణుల మాంసం విక్రయాలు చేస్తున్నారని సమాచారం అందడంతో.. గగన్పహాడ్ పారిశ్రామిక వాడలో SOT పోలీసులు దాడులు చేశారు. దీంతో రైడ్స్ జరిపిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి రెండున్నర లక్షల విలువ చేసే మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.