Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
Mallareddy: 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
Mallareddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
Mallareddy: తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మల్లారెడ్డిపై శామీర్పేట్ పోలీస్స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. మాజీ మంత్రి 47 ఎకరాలు కబ్జా చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని ఆరోపిస్తున్నారు. మల్లారెడ్డితో పాటు ఎమ్మార్వోతో పాటు పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. మొత్తం 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.