150 అడుగుల లోతులో పడ్డ వృద్ధుడిని పోలీసుల రక్షించారు. తాళ్ళ సహాయంతో బావి లోపలకు దిగి కాపాడారు. క్రేన్ ద్వారా బావిలోనున్న వృద్ధుడిని బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ శివారులోని పాడుబడ్డ బావిలో 60 ఏళ్ల చంద్రయ్య కాలు జారి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. 150 అడుగులలోతులో ఉన్న బావిలోకి పోలీసులు తాళ్ల సహాయంతో కిందకు దిగారు. క్రేన్ ద్వారా బావిలోనుంచి వృద్ధుడిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే 108 అంబులెన్స్ లో బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నాలుగు గంటలు శ్రమించి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన పోలీసులపై స్థానికులు ప్రశంసలు కురిపించారు.