స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్

Hyderabad 5K Run: పాల్గొన్న మంత్రులు మొహమ్మద్ అలీ, తలసాని, సీపీ ఆనంద్

Update: 2022-08-11 03:19 GMT

స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 5కే రన్

 Hyderabad 5K Run: స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో 5కే రన్ నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఈ 5కే రన్.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందని, మహాత్మాగాంధీతో పాటు మన తాతల తరాల వారు స్వాతంత్య్రం కోసం పోరాడారని, ఈ వేడకలు ఆగస్ట్ 15 వరకు కొనసాగుతాయని సీపీ ఆనంద్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో హోం మంత్రి మొహమ్మద్ అలీ, మంత్రి తలసాని యాదవ్, సీపీ ఆనంద్ తదితరలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News