మేడ్చల్ జిల్లా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నాలుగేళ్ల బాలుడు బైక్ సర్వీసింగ్ కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. నిన్న సాయంత్రం బైక్ షోరూం పక్కనే ఉన్న మైదానంలో ఆడుకోవడానికి వచ్చిన బాలుడు గుంతలో పడి చనిపోయాడు. బైక్ సర్వీసింగ్ యజమానిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్ షోరూమ్ కూడా అక్రమ కట్టడమని అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.