యువకుల వీరంగం.. ఓ అమ్మాయిని ప్రేమించాడని కత్తులతో దాడి...

Hyderabad: ఆస్పత్రికి తరలించిన స్థానికులు, నజీర్‌ పరిస్థితి విషమం...

Update: 2022-05-22 09:30 GMT

Representational Image

Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌ అల్కాపురి టౌన్‌షిప్‌లో యువకులు వీరంగం సృష్టించారు. ఓ అమ్మాయిని ప్రేమించాడని నజీర్ అనే యువకుడ్ని కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు యువకులు నవీద్, అక్బర్. తీవ్ర గాయాలపాలైన నజీర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక పరారీలో ఉన్న నవీద్, అక్బర్‌పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

Tags:    

Similar News