ఎంతో సిగ్గు పడాల్సిన ఘటన : విరాట్ కోహ్లీ
షాద్నగర్ అమ్మాయి డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం, హత్య ఘటన దేశ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
షాద్నగర్ అమ్మాయి డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం, హత్య ఘటన దేశ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా.. ప్రియాంక హత్యాచార ఘటన ఖండిస్తూ.. పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. నిందితులకు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రియాంక హత్యపై ట్విట్టర్లో స్పందించారు. సమాజం సిగ్గు పడే ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఇలాంటి అమానవీయ ఘటనలకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని విరాట్ కోహ్లీ ట్విటర్లో తెలిపారు.
డిసెంబర్ 6 నుంచి వెస్టిండీస్ భారత్ మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈ నెల ఆరున హైదరాబాద్లోని ఉప్పల్లో జరగనుంది.
What happened in Hyderabad is absolutely shameful.
— Virat Kohli (@imVkohli) November 30, 2019
It's high time we as a society take charge and put an end to these inhumane tragedies.