26/11 ఉగ్రదాడిపై కోహ్లీ భావోద్వేగ ట్వీట్

ఈ మారణ హోమంలో మరణించిన వారికి టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Update: 2019-11-26 14:31 GMT
విరాట్ కోహ్లీ

సరిగ్గా ఇదే తేదీనా 26/11 ముంబై ఉగ్రదాడి జరిగి 11 ఏళ్లు అయింది. ఈ మారణ హోమంలో మరణించిన వారికి టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తోపాటు పుజారా, రహానే, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ ట్వీట్లు చేశారు.

ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను, వీరులను స్మరించుకుంటున్నా, అంతా చనిపోయినప్పటికీ వారిని స్పరించుకుంటామని కోహ్లీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది జరిగి 11 ఏళ్లు గడిచాయని, ప్రాణాలకు పనంగా పెట్టిన పోలీసులు, సాయుధ బలగాల త్యాగాలను తాము మరవబోమని సచిన్ అన్నారు. ఉగ్రదాడుల్లో చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్ననని పుజారా ట్వీట్ చేశారు.




Tags:    

Similar News