26/11 ఉగ్రదాడిపై కోహ్లీ భావోద్వేగ ట్వీట్
ఈ మారణ హోమంలో మరణించిన వారికి టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
సరిగ్గా ఇదే తేదీనా 26/11 ముంబై ఉగ్రదాడి జరిగి 11 ఏళ్లు అయింది. ఈ మారణ హోమంలో మరణించిన వారికి టీమిండియా సారధి విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తోపాటు పుజారా, రహానే, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ ట్వీట్లు చేశారు.
ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలను, వీరులను స్మరించుకుంటున్నా, అంతా చనిపోయినప్పటికీ వారిని స్పరించుకుంటామని కోహ్లీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇది జరిగి 11 ఏళ్లు గడిచాయని, ప్రాణాలకు పనంగా పెట్టిన పోలీసులు, సాయుధ బలగాల త్యాగాలను తాము మరవబోమని సచిన్ అన్నారు. ఉగ్రదాడుల్లో చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్ననని పుజారా ట్వీట్ చేశారు.
Remembering the bravehearts and the innocent civilians who lost their lives during the 26/11 attacks. Gone but never forgotten. 🙏🇮🇳
— Virat Kohli (@imVkohli) November 26, 2019
It's been 11 years, but we shall not forget the sacrifices of our brave police & armed forces. They took the fall to ensure the nation and humanity stands tall. My heart goes out to the families of all affected victims. #MumbaiTerrorAttack
— Sachin Tendulkar (@sachin_rt) November 26, 2019