Viral Girl: ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. వైరల్ అవుతున్న వీడియోలు
ఓ అమ్మాయి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ చూస్తోంది. టీమిండియా జెర్సీ ధరించిన ఆమె తన ఫోన్లో మ్యాచ్ను వీడియో తీస్తోంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో కెమెరాల చూపు ఆమెపై పడింది. ఇంకేముంది ఆమెను కెమెరాలో బంధించేశారు.
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు.. వైరల్ అవుతున్న వీడియోలు
Viral Girl: దుబాయ్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ అమ్మాయికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఓ అమ్మాయి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ చూస్తోంది. టీమిండియా జెర్సీ ధరించిన ఆమె తన ఫోన్లో మ్యాచ్ను వీడియో తీస్తోంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండడంతో కెమెరాల చూపు ఆమెపై పడింది. ఇంకేముంది ఆమెను కెమెరాలో బంధించేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీవీ స్క్రీన్ పై కూడా కనిపించింది. ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎవరో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు.
@Poojayadav206 అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. దాదాపు ఆరు వేల మంది లైక్ చేసి తమ స్పందనలు తెలియజేశారు. ఆమె చాలా అందంగా ఉందని.. బాలీవుడ్ హీరోయిన్లా ఉందని కామెంట్స్ చేశారు.