హోబర్ట్‌ ఈవెంట్‌తో మళ్లి బరిలోకి సానియా

Update: 2019-11-29 01:28 GMT
Sania Mirza File Photo

ఇండియన్ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మళ్లి గ్రౌండ్ లోకి దిగనుంది. 2017 సంవత్సం అక్టోబర్‌ నుంచి సానియామీర్జా ఆటకు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే జరగబోయే అంతర్జాతీయ టెన్నిస్‌ సర్క్యూట్‌లో సానియా మీర్జా ఆడనుంది. 2020లో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌తోపాటు ఆస్ట్రేలియా ఓపెన్‌ పాల్గొంటానని 33 ఏళ్ల హైదరాబాదీ టెన్నిస్‌ స్టార్‌ వెల్లడించింది. సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్‌ మహిళల డబుల్స్‌లో ఉక్రెయిన్ క్రీడాకారినీ నాదియా కిచనోక్‌ తో కలిసి బరిలోకి దిగనుంది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ రాజీవ్‌ రామ్‌తో కలిసి బరిలోకి ఆడుగుపెట్టనుంది. 

Tags:    

Similar News