వెస్టిండీస్తో డిసెంబర్ ఆరు నుంచి మూడు టీ20లు వన్డే సిరీస్ జరగనుంది. తొలి టీ20 హైదరాబాద్లో జరగనుంది. ఈ సిరీస్ మొదట్లోనే భారత్ కు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా విధంసకర ఓపెనర్ ధావన్ మోకాలి గాయంతో సిరీస్కు దూరమైయ్యాడు. అయితే ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్లో రాహుల్ సత్తాచాటాడు. మూడోస్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతడు రాణించాడు. దీంతో కోహ్లీకూడా రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కూడా కోహ్లీకి వత్తాసు పలికాడు. రోహిత్ తో కలిసి రాహుల్ను ఓపెనర్ గా బరిలోకి దించాలని సూచించాడు. కోహ్లీ మూడో స్థానంలో ఎప్పటిలానే బ్యాటింగ్ చేస్తే బాగుటుందని వ్యాఖ్యానించారు. విండీస్ సిరీస్ తోనే ఈ మార్పలు చేస్తే బాగుంటుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.
బంగ్లాదేశ్ సిరీస్లో రాణించిన టీమిండియా బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ను లక్ష్మణ్ ప్రసంశలతో ముంచెత్తాడు. అతని బ్యాటింగ్ సైలి బాగుందన్నారు. నాగ్పూర్లో మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకు పెవిలియన్కు చేరిన సమయంలో పరిణితితో రాణించాడని తెలిపాడు. ఒక ఎండ్లో రిషబ్ పంత్ స్ట్రైక్ రొటేట్ చేయలేక సమమతమవుతుంటే, శ్రేయస్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడని లక్ష్మణ్ కితాబిచ్చాడు.