కరోనావైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం వణికిపోతోంది. అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి. విశ్వవ్యాప్తంగా అన్ని మెగా ఈవెంట్లు వాయిదా పడుతున్నాయి. దేశాధినేతలు, రాజకీయ నేతలకు సైతం కరోనా సోకడంతో అన్ని కార్యక్రమాలూ రద్దవుతున్నాయి. ఈ క్రమంలో భారత్లో పొట్టి క్రికెట్ పండగ ఐపీఎల్ సైతం వాయిదా పడింది. తమ రాష్ట్రాల్లో ఐపీఎల్ నిర్వహించబోమని ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం సూచన మేరకు ఐపీఎల్-2020ని వాయిదా వేసింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మ్యాచ్లు కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయి. దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Sources: Indian Premier League (IPL)-2020 postponed till April 15. #Coronavirus pic.twitter.com/r8C2TwUnMY
— ANI (@ANI) March 13, 2020