టాస్ గెలిచిన భారత్.. తుది జట్టు ఇదే

Update: 2020-01-05 13:15 GMT
India vs Sri Lanka, 1st T20 Match

గువాహటి వేదికగా టీమిండియా శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సీరిస్‌లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ‌ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ నెగ్గింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గత సంవత్సరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టీండీస్ పై వరుస విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక జట్టు మాత్రం పాకిస్థాన్ పై జరిగిన టీ20 సిరీస్ లో విజయం సాధించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. ఈ సారి భారత్ పై రాణించి విజయంతో ఈ సంవత్సంలో ఆరంభించాలని మలింగసేన యోచిస్తుంది.

తుది జట్టు ‌:

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్, శార్దుల్ ఠాకుర్, బుమ్రా, నవదీప్ షైనీ

శ్రీలంక: లతీస్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్సా, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌, షనక, ఉడానా, హసరంగ, లహిరు కుమార, ధనుంజయ డిసిల్వా



Tags:    

Similar News