IND vs NZ 2nd ODI: ఆఖరి ఓవర్లలో తుస్ మనిపించిన భారత బౌలర్లు.. టార్గెట్ 274
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో కివీస్ భారత్ ముందు 274 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ ఓపెనర్ గుప్తిల్(79,79బంతుల్లో, 8ఫోర్లు, 3 సిక్సుల) అర్థసెంచరీతో రాణించాడు. రాస్ టేలర్ (73,74బంతుల్లో, ఆరు ఫోర్లు, 2 సిక్సులు) అర్థ శతకంతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్ నికోలస్ 41 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్లు విజృంభించి 30 పరుగలు వ్యవధిలోనే 5 వికెట్లు పడగొట్టారు. ఒక దశలో కివీస్ 250 మార్క్ దాటడం కూడా కష్టమే అనిపించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల కోల్పోయి 273 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లలో రాస్ టేలర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత బౌలర్లు చేతులేత్తేశారు.తొమ్మిదో వికెట్ కు టేలర్, జెమీసన్(24)తో 76 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో కీవీస్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీశాడు. శార్థుల్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.
273/8 on the board at @edenparknz. A 76 run partnership from 54 balls between Ross Taylor and Kyle Jamieson providing vital late runs in Auckland. Scorecard | https://t.co/6E9wqCe2kt #NZvIND pic.twitter.com/WSEFMSR14p
— BLACKCAPS (@BLACKCAPS) February 8, 2020